VijayaKumar

Mar 26 2024, 18:04

భువనగిరి భాజపా పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో రజాకార్ సినిమా ప్రదర్శన


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ని శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ లో గూడూరు నారాయణరెడ్డి నిర్మాత గా యాట సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మించిన రజాకార్ సినిమాను మంగళవారం, బుధవారం రోజులలో ఈ సినిమాని రెండు షోలు భారతీయ జనతాపార్టీ సినియర్ నాయకులు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో రజాకార్ సినిమాను రెండు రోజులు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.

వలిగొండ మండల ప్రజలు నాయకులు బిజెపి పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వలిగొండ సినిమా థియేటర్ కు వచ్చి రజాకార్ సినిమాలు తిలకించి ఆనాడు రజాకారుల నాయకుడు కాశీం రజ్వి చేసిన అరాచకాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన రజాకార్ సినిమా దర్శకులు యాట సత్యనారాయణకు నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన మండలం భాజపా నాయకులు ఎన్నో వ్యయ ప్రయాసలను భరించి ఈ రజాకార్ సినిమా నిర్మించినందుకుగాను వారికి వారి సినిమా యూనిట్ కు ధన్యవాదములు తెలుపవలసిందిగా కోరడం జరిగినది. ఈ సినిమా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఇతరులకు చూసే విధంగా ప్రోత్సహించాలని కోరడం జరుగుతుంది. మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ బచ్చు శ్రీనివాస్ గుప్తా, భాజపా కిసాన్ మోర్చా మండల శాఖ అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్, సీనియర్ నాయకులు దంతూరి సత్తయ్య, గౌడ్ సీలోజు శ్రీరాములు, బందారపు రాములు, రాచకొండ కృష్ణ, బాసవాడ బిక్షపతి, మంద నరసింహ, తదితర నాయకులు మండల ప్రజలకు రజాకార్ సినిమాను తిలకించవలసిందిగా కోరడం జరుగుతుంది.

VijayaKumar

Mar 26 2024, 17:26

ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నాయకుడికి 100 ప్రశ్నలు లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నయకుడికి 100 ప్రశ్నలు కార్యక్రమంలో భాగంగా భువనగిరి పరిధిలోని దీప్తి హోటల్ నందు మంగళవారం రెండు గంటలకు ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల్లో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని ఇప్పటికే 118 గ్రామాల్లో పర్యటించి అండర్ పాస్ ను సాంక్షన్ చేశామని అన్నారు. యాదాద్రి ని యాదగిరిగుట్ట గా పేరు మార్చామని కొండపైకి ఆటోల కు అనుమతి కల్పించి 300 కార్మికుల సమస్యలను తీర్చామని అన్నారు. కొండపైన భక్తులు నిద్రించే సౌకర్యం కల్పించడం జరిగిందని మరియు కొబ్బరికాయలు కొట్టే స్థలం ఏర్పాటు చేశామని అన్నారు.

VijayaKumar

Mar 26 2024, 17:20

దాసిరెడ్డి గూడెంలో మాజీ మావోయిస్టు సాంబశివుడి 13వ వర్ధంతి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో. ఉద్యమాల యుద్ధభేరి. సాంబశివుడు 13వ వర్ధంతిని.

 ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్వర్ణలత కూతురు అల్లుడు అనిల్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అడవిని వదిలి, ప్రజలకు సేవ చేసే క్రమంలో ఓర్వ లేక హత్య చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నారి మల్లేష్ ,నారి నరసింహ, నారి శ్రీశైలం, నారి బాలకృష్ణ ,సాయికుమార్ మరియు మండల టిఆర్ఎస్ నాయకులు తుమ్మల వెంకటరెడ్డి. కొమిరెల్లి సంజీవరెడ్డి. పడమటి మమత నరేందర్ రెడ్డి. డేగల పాండు. మాద శంకర్ లావణ్య. దామోదర్ రెడ్డి. పాల్గొని ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించారు.

VijayaKumar

Mar 24 2024, 23:22

చిత్తాపురం స్టేజి వద్ద స్కూటీని ఢీ కొట్టిన కారు పలువురికి గాయాలు కేసు నమోదు చేసిన వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాలడుగు గ్రామానికి చెందిన యాస బిక్షం రెడ్డి తన కూతురి వివాహ పత్రికలు తీసుకుని చిత్తాపురం లో ఇచ్చి తిరుగు ప్రయాణంలో స్కూటీ పై చిత్తాపురం స్టేజి వద్దకు రాగానే అతివేగంగా, జాగ్రత్తగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బిక్షం రెడ్డి తలకి, చేతులకి, కాళ్ళకి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం నల్గొండ లోని ఐకాన్ హాస్పిటల్ కి తరలించారు . కారులో ప్రయాణిస్తున్న పోలంగరి శ్రీనివాస్ రెడ్డి, పద్మావతి, బాలకృష్ణ రెడ్డి, సంధ్య లకు కూడా గాయాలయ్యాయి. కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాస బిక్షం రెడ్డి అల్లుడు బొక్క సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

VijayaKumar

Mar 24 2024, 17:21

బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులుగా బచ్చు శ్రీనివాస్ గుప్త నియామకం


 

భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల కేంద్రంకు చెందిన బచ్చు శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు గా ఎంపిక కావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అద్యక్షులు పాశం భాస్కర్ నియామక పత్రం ను వారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన వలిగొండ మండల అద్యక్షులు బోల్ల సుదర్శన్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు CN రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,పార్లమెంట్ కన్వినర్ బందారపు లింగ స్వామి గౌడ్ , స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్ర శేఖర్, జిల్లా సెక్రటరీ కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య గౌడ్ సీనియర్ నాయకులందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని గ్రామాల్లో పార్టీ పటిష్టతకు పని చేస్తానని,పార్టీ పిలుపు మేరకు పని చేస్తానని వారు అన్నారు.

VijayaKumar

Mar 24 2024, 08:54

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

   

  తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్ల కన్వీనర్ కాశాపాక మహేశ్ అధ్యక్షతన జరిగిన # రౌండ్ టేబుల్ సమావేశం # ఫాసిస్టు న‌రేంద్ర మోదీని ఓడించండి,రాజ్యాంగ‌, ప్ర‌జాస్వామిక విలువ‌ల‌ను ప‌రిర‌క్షించండన్ని పిలుపు ఇచ్చారు.       ఈ కార్యక్రమం లో CPM జిల్ల కార్యదర్శి MD జాంగిర్. బట్టు రామచంద్రయ్య. R. జనార్దన్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి. ఉప్పలయ్య CPIML జిల్ల కార్యదర్శి. సుదర్శనాయర్ క్రిస్టియన్ ఫాస్టర్. అమిద్ పాషా. కట్టెల లింగస్వామి టీచర్. Asgar అలీ CAF కన్వీనర్. S. మల్లారెడ్డి సీనియర్ పాత్రికేయులు. M. సతయ్య DTF జిల్ల అధ్యక్షులు.. బోయ నర్సింహ్మ. కావలి యాదయ్య. రసాల బాలస్వామి.G.బాలకృష్ణ.  డిటిఎఫ్ సత్తయ్య . తదితరులు పాల్గొని మాట్లాడారు.

ప్రియ‌మైన ప్ర‌జ‌లారా..! ప్ర‌జాస్వామిక వాదులారా..!!

రెండు నెల‌ల్లో దేశంలో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రుగ‌బోతున్నాయి. ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీల‌న్నీ క‌ల్లబొల్లి మాట‌ల‌తో స‌రికొత్త హామీల‌తో ముస్తాబై ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నాయి. మసిబూసి మారెడుగాయ చేసి ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు వాగ్దానాల్లో పోటీ ప‌డుతున్నాయి. అంద‌మైన అబ‌ద్దాల‌తో, అంతుపొంతూ లేని హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు పోటీ ప‌డుతున్నాయి. ఓట‌ర్ల‌ను ఏ విధంగానైనా ప్ర‌స‌న్నం చేసుకొని ఓట్లు దండుకొని గ‌ద్దెనెక్కేందుకు ఆరాట‌ప‌డుతున్నాయి. ధ‌న బ‌లం, కండ‌బ‌లం, కుల బ‌లం ఆస‌రా చేసుకొని ఓట‌ర్ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకొనేందుకు కుట్ర‌లు కుహ‌కాల‌కు పాల్ప‌డుతున్నాయి. ఇలాంటి ట‌క్కు ట‌మార గార‌డి విద్య‌ల్లో బీజేపీ మొద‌లు కాంగ్రెస్, ఇత‌ర విప‌క్ష పార్టీలు, రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ దాకా అన్ని పార్ల‌మెంట‌రీ రాజ‌కీయ పార్టీలు ఒకదానికి మించి మ‌రొక‌టి పోటీ ప‌డుతున్నాయి. అన్ని పార్టీల ల‌క్ష్యం ఒక్క‌టే.., ఓట్ల‌ను దండుకొని అధికారాన్ని కైవ‌సం చేసుకోవ‌టం. దీనికోసం పార్టీల‌న్నీ ఎంత‌కైనా తెగిస్తున్నాయి. ఎంత‌టి నైచ్యానికైనా దిగ‌జారుతున్నాయి. 

అయితే.. అధికారం కోసం, ఓట్లు దండుకోవ‌టం కోసం చేసే కుట్ర‌లు, కుహ‌కాల్లో న‌రేంద్ర‌మోదీ నేతృత్వం లోని బీజేపీ మ‌రో ఆకు ఎక్కువ చ‌దివింది. మెజారిటీ వాదంతో స‌మాజంలో విభ‌జ‌న రేఖ‌లు గీసి మ‌త ఉద్రిక్త‌త‌ల‌ను పెంచి పోషిస్తున్న‌ది. మ‌తాన్ని రాజ‌కీయంతో జోడించి మ‌త‌రాజ‌కీయం చేస్తున్న‌ది. ఓట్ల కోసం మ‌త విశ్వాసాల‌ను, సున్నిత సంస్కృతిక అంశాల‌ను వాడుకుంటున్న‌ది. మ‌త క‌ల‌హాల‌ను రేపుతూ శ‌వాల గుట్ట‌ల‌పై ఓట్ల‌ను ఏరుకొంటున్న‌ది. 80వ‌ ద‌శ‌కంలో రెండు సీట్ల‌కే ప‌రిమిత‌మైన బీజేపీ నేడు అధికా రం చేజిక్కించు కునేంత‌గా సంఖ్యాబ‌లం పెంచుకోవ‌టంలో ఆర్ఎస్ఎస్ సంఘ్‌ప‌రివార్ శ‌క్తులు, మోదీ నాయ‌క‌త్వంలోని బీజేపీ రేపిన మ‌త‌క‌ల‌హాలు, పారించిన నెత్తురు అంతా ఇంతా కాదు. అయోధ్య‌ ర‌థ‌యాత్ర నుంచి గుజ‌రాత్ మార‌ణ‌కాండ దాకా దేశాన్ని మ‌రుభూమిగా మార్చి స‌మాజంలో ర‌క్త‌పుటేరులు పారించి అధికారపీఠాన్ని చేజిక్కించుకున్న‌ది. 

గుజ‌రాత్ మార‌ణ‌కాండ శ‌వాల‌గుట్ట‌ల‌పై 2014లో అధికారం చేజిక్కించుకున్న మోదీ... ముచ్చ‌ట‌గా మూడో సారి అధికారాన్ని కైవ‌సం చేసుకోవ‌టం కోసం నానా తంటాలు ప‌డుతున్నాడు. సాధార‌ణ ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌జ‌ల్లో సెంటిమెంటును రాజేసి, మ‌త ఉద్రిక్త‌త‌ల‌ను పెంచి మెజారిటీ ఓట్ల‌ను కొల్ల‌గొట్టే ప‌నిని ఒక క‌ళగా అభివృద్ధి చేసిన మోదీ ఇప్పుడు స‌రికొత్త అస్త్రాల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నాడు. మొద‌టి ద‌ఫా అయోధ్య రామాలయాన్ని, మ‌త విభ‌జ‌న‌ను వాడుకుంటే; రెండో ద‌ఫాలో స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌లు, పుల్వామా దాడుల‌ను వాడుకొని ఓట్లు దండుకున్నాడు. ఇప్పుడు తాజా ఎన్నిక‌ల కోసం అయోధ్య‌లో రామాల‌యం క‌ట్టించాన‌నీ, వార‌ణాసిలో జ్ఞ‌న‌వాపీ మ‌సీదును కూల్చి ఆల‌యాన్ని నిర్మిస్తాన‌నీ, మ‌ధుర‌లో శ్రీ‌కృష్ణ మందిరం నిర్మిస్తాన‌ని చెప్తూ మెజారిటీ ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు కుట్ర‌లు కుహ‌కాలు ప‌న్నుతున్నాడు. 

అధికారం చేప‌ట్టిన నాటి నుంచీ ఒకే దేశం ఒకే ప్ర‌జ నినాదం ఎత్తుకున్న మోదీ సీఏఏ, ఎన్ఆర్‌సీ లాంటి చ‌ట్టాల‌తో ప్ర‌జ‌ల పౌర‌స‌త్వ హ‌క్కునే కాల‌రాస్తున్నాడు. ఒక్క క‌లం పోటుతో ల‌క్ష‌లాది మంది పౌర‌స‌త్వ హ‌క్కును ర‌ద్దుచేసి రాత్రికిరాత్రి ల‌క్ష‌లాది మందిని కాందిశీకుల‌ను చేశాడు. జ‌మ్ము క‌శ్మీర్ ప్ర‌త్యేక ఉనికికి ర‌క్ష‌ణ‌గా ఉన్న 370 ఆర్టిక‌ల్ ను ర‌ద్దు చేసి, కశ్మీర్‌ను మూడు ముక్క‌లుగా విడ‌గొట్టి అంద‌మైన క‌శ్మీర్‌ను అంబానీ, ఆదానీల‌కు అప్ప‌గిస్తున్నాడు. రాజ్యాంగాన్నే మార్చేసి త‌మ‌దైన మ‌నువాద వ‌ర్ణాశ్ర‌మ ధ‌ర్మాల ను (విలువ‌ల‌ను) అమ‌లు చేసేందుకు పావులు క‌దుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించిన మేధావులు, ర‌చ‌యిత‌ల‌పై క‌క్ష‌గ‌ట్టి దాడులు, హ‌త్య‌ల‌కు గురిచేస్తున్న‌ది మోదీ ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేశ్‌, హేతువాద ర‌చ‌యిత‌, కార్మిక నేత గోవింద్ ప‌న్సారే, క‌ల‌బుర్గి లాంటి ఎంద‌రో మేధావుల‌ను సంఘ్‌ప‌రివార్ శ‌క్తులు హ‌త్య‌చేశాయి. ప్ర‌జా ఉద్య‌మాల‌కు మ‌ద్ద‌తు గా నిలిచి ఆదివాసీల హ‌క్కుల కోసం పోరాడుతున్న వారిపై కుట్ర‌కేసులు పెట్టి జైలు నిర్బంధాల‌కు గురిచే సింది బీజేపీ ప్ర‌భుత్వం. తెలంగాణ నుంచి ప్ర‌ఫెస‌ర్ సాయిబాబ‌, విప్ల‌వ క‌వి వ‌ర‌వ‌ర‌రావుల‌ను ఏండ్ల త‌ర‌బ‌డి జైలు పాలు చేసింది. త‌మ మ‌త‌రాజ‌కీయాల‌ను విమర్శిస్తున్న వారిని దేశ వ్య‌తిరేకులుగా చిత్రీక‌రిస్తూ తీవ్ర నిర్బంధాల‌కు గురిచేస్తున్నది. మొత్తంగా మెజారిటీ వాద రాజ‌కీయంతో మెజారిటీ స‌మ్మ‌తిని కూడ‌గ‌ట్టి ఫాసిస్టు పాల‌న దిశ‌గా మోదీ దేశాన్ని తీసుకుపోతున్నాడు.

- తెలంగాణ ప్ర‌జాఫ్రంట్‌, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా

VijayaKumar

Mar 23 2024, 22:48

వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిగాస్తుల గుర్తింపు సర్వే


కుష్ఠు వ్యాధి నివారణ కొరకు, కుష్ఠు వ్యాధిగ్రస్తులు గుర్తింపు లో భాగంగా ఇంటి ఇంటి సర్వే నిర్వహించారు. శనివారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వేములకొండ వైద్య సిబ్బంది, హై రిస్క్ ఏరియాలు ,దుప్ప్పల్లి గ్రామ క్రాస్ రోడ్ వద్ద ఉన్న రైస్ మిల్లోని హమాలీ కార్మికులకు మరియు వెములకొండ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఇటుక బట్టి కార్మికులకు ,అరుర్ గ్రామం వద్ద గల కోళ్ల పరిశ్రమ లోని కార్మికులకు,వారి చర్మం పై ఉన్న మచ్చలను పరిశీలించి ,కుష్ఠు వ్యాధి లక్షణాలపై వారికి అవగాహన కల్పించటం జరిగినది. ఈ కార్యక్రమంలో నోడల్ పర్సన్ జే సత్తయ్య ,ఆరోగ్య కార్యకర్తలు కె శోభారాణి, జే వినోద, ఎన్ అనిత , ఏ వెంకటేష్,అషా కార్యకర్తలు వి రాణి, ఎం సంతోష, ఎన్ సుజాత, జీ రామలీల ,మిల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Mar 23 2024, 22:41

శ్రీ చైతన్య విద్యాలయం చైర్మన్ తాడూరు చంద్రయ్య మృతి, నివాళులర్పించిన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శనివారం గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రవేట్ స్కూల్ ల రాష్ట్ర నాయకులు శ్రీ చైతన్య విద్యాలయం చైర్మెన్ తాడూరు చంద్రయ్య గారి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి.పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మెరుగు మధు,టాస్మా అసోసియేట్ ప్రెసిడెంట్ పాలకూర్ల వెంకటేశం, కాసుల వెంకటేశం, గుర్నాథ్ పెళ్లి మల్లేశం, మల్ల వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Mar 23 2024, 21:24

మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేద్దాం


మహనీయుల జయంతి ఉత్సవా లను జయప్రదం చెయ్యాలని

శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనంలో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని అనంతరం పలువురు మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే విదంగా ఏప్రిల్ 5 న భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిరావు పూలే ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతులను పురస్కరించుకొని అంబేద్కర్ గారి జయంతి రోజున భువనగిరి పట్టణంలో నిర్వహించే భీమ్ యాత్రను జయప్రదం చేయాలని కోరారు....

నోట్ ... 27/03/2024 బుధవారం రోజు మధ్యాహ్నం 3:00గంటలకు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనంలో మరో సమావేశం కలదు. అందరూ తప్పక హాజరు కాగలరు.

ఈకార్యక్రమంలో.... దళిత ఐక్యవేదిక బట్టు రామచంద్రయ్య నాగరం అంజయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కర్తల శ్రీనివాస్ ఈరపక నర్సింహ కౌన్సిలర్ ఇటుకల దేవేందర్ దర్గాయి నర్సింగ్ రావు నిలుగొండ శివశంకర్ దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బాణోత్ భాస్కర్ నాయక్ కర్కాల సుదర్శన్ పడిగల ప్రదీప్ డకురి ప్రకాష్ తొంట సత్యనారాయణ గ్యాస్ చిన్న కుతడి సురేష్ మైలారం వెంకటేష్ జాలిగం శివ బండారు జగదీశ్వర్ మోలుగు లక్ష్మణ్ సిల్వర్ రమేష్ దిరవత్ రాజేష్ నాయక్ అందే నరేష్. వడ్డేపల్లి దాస్ మీడి కొటేష్ ఎర్ర మహేష్ సిర్పంగా చందు. బుక్య సంతోష్ నాయక్ మంద శివ సుక్క స్వామి దండు నరేష్ ఎర్ర శ్రీరాములు దర్గాయి జహంగీర్ రవి వర్మ చంద్రమౌళి పల్లెర్ల రాజు శ్రీనివాస్ కోట సుధాకర్ అందే సాయి సందీప్ బలస్వామి కొండమడుగు రమేష్ బాలరాజు బుశపక మల్లేష్ నర్సింగ్ సురేష్ లు తదితరులు పాల్గొన్నారు .

VijayaKumar

Mar 23 2024, 17:05

ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదర్శ పాఠశాలలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం


సమాజ సేవలో భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు రావాలి

దేశవ్యాప్తంగా భగత్ సింగ్ జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాలలో నుండి తొలగించే కుట్రను మానుకోవాలి

వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు

భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం 23 ఏళ్లకే అతి చిన్న వయసులో తన ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన గొప్ప స్వతంత్ర ఉద్యమకారులు భగత్ సింగ్ అన్నారు నేటి సమాజంలో విద్యార్థులు భగత్సింగ్ స్ఫూర్తితో ముందుకు రావాలన్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ లాంటి మహనీయుల చరిత్రను వక్రీకరిస్తూ పాఠ్య పుస్తకాలలో నుండి తొలగించేకుట్రా జరుగుతా ఉంది ఈ సరైనది కాదు దేశవ్యాప్తంగా విద్యార్థులకు తెలుసుకొన విధంగా భగత్ సింగ్ చరిత్ర పాఠ్యపుస్తకాలల్లో చేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాస్ బుగ్గ ఉదయ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు రాము ఐలయ్య లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.